సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా నేత డీవీ కృష్ణ మృతి
ABN , First Publish Date - 2022-06-27T09:28:39+05:30 IST
సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి, ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్...
గాంధీ మెడికల్ కాలేజీకి భౌతికకాయం అప్పగింత
హైదరాబాద్ సిటీ, జూన్ 26 (ఆంధ్రజ్యోతి) : సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి, ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు దుర్గంపూడి వెంకటకృష్ణ (77) మృతి చెందారు. ఆదివారం ఉదయం నగరంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. డీవీ కృష్ణ స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లా, మాచర్ల దగ్గర తేలుకుంట్ల. 1970లలో ఆయన విప్లవ కమ్యూనిస్టు పార్టీలో చేరారు. బీడీ వర్కర్ల యూనియన్, సిరిసిల్ల రైతాంగ ఉద్యమం, నిమ్మపల్లి పోరాట నిర్మాణంలోనూ కీలకంగా పనిచేశారు. సీపీఐ(ఎం.ఎల్)ప్రజాపంథా పార్టీ నిర్మాణంలోనూ డీవీ కృష్ణ ప్రముఖ పాత్ర పోషించారు. డీవీ కృష్ణ భౌతికకాయాన్ని వైద్యవిద్యార్థుల పరిశోధన నిమిత్తం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు.