‘వారి మృతి పార్టీకి తీరనిలోటు’

ABN , First Publish Date - 2020-09-29T17:45:04+05:30 IST

సీపీఐ (ఎంఎల్‌) కేంద్ర కమిటీ నాయకుడు ఎస్‌కే ముక్తార్‌ షాషా, రాష్ట్ర నాయకురాలు..

‘వారి మృతి పార్టీకి తీరనిలోటు’

రంపచోడవరం: సీపీఐ (ఎంఎల్‌) కేంద్ర కమిటీ నాయకుడు ఎస్‌కే ముక్తార్‌ షాషా, రాష్ట్ర నాయకురాలు పైలా చంద్రమ్మ, ఐఎఫ్‌ టీయూ జిల్లా నాయకుడు లావేటి సత్యనారాయణ మృతి తీరని లోటని న్యూడెమోక్రసీ డివిజన్‌ కార్యదర్శి కుంజా దూలయ్య అన్నారు. సోమవారం మార్క్స్‌-ఏంగిల్స్‌ భవన్‌లో కె.బాలురెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సంతాప సభలో పలువురు మాట్లాడుతూ వారి ఆశయ సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళి అన్నారు. పల్లాల అశోక్‌, పి.మాధవరెడ్డి, ఐ.రమణ, పి.అనసూయ, బి.శ్రీదేవి, ఇల్లా బాలురెడ్డి, బి.బొజ్జిరెడ్డి, కె.లచ్చన్నదొర, కన్నయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-29T17:45:04+05:30 IST