‘వారి మృతి పార్టీకి తీరనిలోటు’
ABN , First Publish Date - 2020-09-29T17:45:04+05:30 IST
సీపీఐ (ఎంఎల్) కేంద్ర కమిటీ నాయకుడు ఎస్కే ముక్తార్ షాషా, రాష్ట్ర నాయకురాలు..
రంపచోడవరం: సీపీఐ (ఎంఎల్) కేంద్ర కమిటీ నాయకుడు ఎస్కే ముక్తార్ షాషా, రాష్ట్ర నాయకురాలు పైలా చంద్రమ్మ, ఐఎఫ్ టీయూ జిల్లా నాయకుడు లావేటి సత్యనారాయణ మృతి తీరని లోటని న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి కుంజా దూలయ్య అన్నారు. సోమవారం మార్క్స్-ఏంగిల్స్ భవన్లో కె.బాలురెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సంతాప సభలో పలువురు మాట్లాడుతూ వారి ఆశయ సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళి అన్నారు. పల్లాల అశోక్, పి.మాధవరెడ్డి, ఐ.రమణ, పి.అనసూయ, బి.శ్రీదేవి, ఇల్లా బాలురెడ్డి, బి.బొజ్జిరెడ్డి, కె.లచ్చన్నదొర, కన్నయ్య పాల్గొన్నారు.