ప్రజా సమస్యలపై పోరాటాలు

ABN , First Publish Date - 2021-10-22T05:15:27+05:30 IST

ప్రజా సమస్యలపై పోరాటాలు

ప్రజా సమస్యలపై పోరాటాలు
మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

సీపీఐ జిల్లాస్థాయి సమావేశం తీర్మానం

గన్నవరం, అక్టోబరు 21 : ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. మండలంలోని దావాజీగూడెం ఎస్వీఆర్‌ కల్యాణమండపంలో సీపీఐ జిల్లాస్థాయి సమావేశం గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ స్థానిక సమస్యలను గుర్తించాలన్నారు. కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారాలు మోపే పనిలో ఉన్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సమస్యలపై పోరాడేందుకు తీర్మానించామని చెప్పారు. ఈ పోరాటాల్లో ప్రతి కార్యకర్త, సీపీఐ సానుభూతిపరులు, ఇతరులను భాగస్వాములను చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ,  మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, దోనేపూడి శంకర్‌, చలసాని వెంకటరామారావు, టి.కృష్ణయ్య, వెలగపూడి అజాద్‌, పెద్దు వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-22T05:15:27+05:30 IST