Modi హైదరాబాద్ పర్యటన... సీపీఐ నేతల హౌస్ అరెస్టు
ABN , First Publish Date - 2022-05-26T17:28:42+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో సీపీఐ నిరసనలకు పిలుపునిచ్చింది.
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో సీపీఐ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సీపీఐ నేత చాడా వెంకటరెడ్డి సహా.. పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మరోవైపు హిమాయత్ నగర్లో సత్యనారాయణరెడ్డి భవన్ వద్ద నల్ల చొక్కాలతో సీపీఐ ఆందోళనకు దిగింది. మోడీ ఎనిమిదేళ్ళ పాలనలో దేశం వందేళ్ళు వెనక్కి వెళ్ళిందని మండిపడ్డారు. మతవిధ్వేషాలను రెచ్చగొట్టి మళ్ళీ మోడీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని సీపీఐ నేతలు ఆరోపించారు.