వ్యవసాయ బిల్లును ఉపసంహరిచుకోవాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-11-28T17:20:39+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

వ్యవసాయ బిల్లును ఉపసంహరిచుకోవాలి: రామకృష్ణ

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో రైతులపై జరిగిన దాడులను ఖండిస్తూ విజయవాడలో సీపీఐ నేతలు చేపట్టిన మౌన దీక్షలో రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై వామ పక్ష పార్టీలు ఉద్యమిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో నివర్ తుఫాన్ మిగిల్చిన నష్టాన్ని పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని డిమాండ్ చేశారు. పంజాబ్ హరగయ రైతులపై జరిగిన దాడులను ఖండిస్తూ వారికి సంఘీబావం ప్రకటిస్తూ మౌన దీక్ష చేపట్టినట్లు తెలిపారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. రైతులకు అండగా వామపక్ష పార్టీలు పోరాడుతూనే ఉంటాయని రామకృష్ణ స్పష్టం చేశారు.

Updated Date - 2020-11-28T17:20:39+05:30 IST