పీఆర్సీ విషయంలో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి: Ramakrishna

ABN , First Publish Date - 2022-01-08T17:23:37+05:30 IST

సీఎం జగన్ పీఆర్సీ విషయంలో ఉద్యోగులను నిరుత్సాహానికి గురిచేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

పీఆర్సీ విషయంలో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి: Ramakrishna

ప్రకాశం: సీఎం జగన్ పీఆర్సీ విషయంలో ఉద్యోగులను నిరుత్సాహానికి గురిచేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కొందరు ఉద్యోగ సంఘ నేతలు బాగానే ఉందని కంటి తుడుపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సజ్జల ఉద్యోగ సంఘాల నేతలతో సంతృప్తిగా ఉందని పాజిటివ్ స్టేట్ మెంట్స్ ఇప్పించారన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62కు పెంచటం ఆమోదయోగ్యంగా లేదని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావన్నారు. అమరావతి విషయంలో ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని మన్నించాలని... రాజధాని అమరావతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


పొత్తులపై సీపీఐ నేత ఏమన్నారంటే...

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులపై మాట్లాడిన రామకృష్ణ... పొత్తుల్లో సర్దుబాట్లు ఉంటాయని చెప్పారు. జాతీయ స్థాయిలో అగ్రనేతల నిర్ణయం మేరకు పొత్తులు ఉంటాయన్నారు. జనసేన పార్టీ బీజేపీతో పొత్తును వీడి బయటకు రావాలని అన్నారు. దేశాన్ని కాపాడాల్సిన మోదీ తన ప్రాణాలకే ముప్పు ఉందని చెప్పటం విడ్డూరమన్నారు. మోదీ ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సోము వీర్రాజు మోదీ కోసం కాకుండా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పట్ల దీక్ష చేయాలని రామకృష్ణ హితవుపలికారు. 

Updated Date - 2022-01-08T17:23:37+05:30 IST