సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2022-03-18T13:50:16+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు.

సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. నిన్న జంగారెడ్డిగూడెంలో సీపీఐ ప్రతినిధిబృందం పర్యటించి, కల్తీ సారా మృతుల కుటుంబాలను పరామర్శించడం జరిగిందన్నారు. కల్తీ మద్యం తాగి 27 మంది చనిపోతే, వాస్తవాలను వక్రీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ప్రయత్నించడం సిగ్గుచేటని మండిపడ్డారు. స్వయంగా తమరే అసెంబ్లీ సాక్షిగా ఇవి కల్తీసారా మరణాలు కాదని ప్రకటించటం దుర్మార్గమన్నారు. కల్తీసారా మరణాలకు కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టాల్సిందిగా మృతుల కుటుంబ సభ్యులను ఒత్తిడికి గురిచేసిన అధికారులపై చర్యలు చేపట్టాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జంగారెడ్డిగూడెంలో పర్యటించి బాధిత కుటుంబాన్ని ఓదార్చాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 


Updated Date - 2022-03-18T13:50:16+05:30 IST