ఇండోర్‌ సభగా ముగింపు సభ: సీపీఐ రామకృష్ణ

ABN , First Publish Date - 2021-12-11T22:22:30+05:30 IST

రాజధాని అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ముగింపు

ఇండోర్‌ సభగా ముగింపు సభ: సీపీఐ రామకృష్ణ

తిరుపతి: రాజధాని అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ముగింపు సభను ఇండోర్‌గా సభ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అమరావతి జేఏసీ అధ్వర్యంలో అఖిలపక్ష భేటీ జరిగింది. టీటీడీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాల, ప్రజా సంఘాల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. మహాపాదయాత్ర ముగింపు సభకు పోలీసులు అనుమతివ్వడం లేదని ఆయన అన్నారు. ఈ నెల 17న రైతుల మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా 175 నియోజకవర్గాల్లో సంఘీభావ సభ, ర్యాలీల నిర్వహణ ఉంటుందని రామకృష్ణ పేర్కొన్నారు. 



Updated Date - 2021-12-11T22:22:30+05:30 IST