జీవీఎల్ కపట నాటకాలు కట్టిపెట్టాలి: Ramakrishna
ABN , First Publish Date - 2022-02-15T14:48:30+05:30 IST
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కపట నాటకాలు కట్టిపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.
అమరావతి: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కపట నాటకాలు కట్టిపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. కేంద్ర త్రిసభ్య కమిటీ అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించటంలో జీవీఎల్ కేలక పాత్ర పోషించారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని వ్యాఖ్యానించారని అన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా విభజన హామీల గురించి చర్చించడానికి ఒక ప్రత్యేక కమిటీని కోరుతూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు లేఖ రాశానంటున్నారని తెలిపారు. బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది అని అనటానికి ఇవే నిదర్శనాలని మండిపడ్డారు. జీవీఎల్ రెండు నాల్కల ధోరణి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్రం ఏపీకి పదేపదే చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 20న విజయవాడలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు రామకృష్ణ పేర్కొన్నారు.