రాష్ట్ర ప్రభుత్వ నిర్భందకాండను ఖండిస్తున్నాం: Ramakrishna
ABN , First Publish Date - 2022-02-03T13:24:25+05:30 IST
ఉద్యమాన్ని అడ్డుకునే బదులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు శ్రద్ధ చూపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హితవుపలికారు.
అమరావతి: ఉద్యమాన్ని అడ్డుకునే బదులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు శ్రద్ధ చూపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హితవుపలికారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఉద్యోగుల గృహ నిర్భందాలు, అరెస్టులు, అధికారులు పోలీసులతో బెదిరింపులు, అడ్డుకోవటం చేశారన్నారు. ముందుగానే పెట్టిన ఉద్యోగుల సెలవులను ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్భందకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పీఆర్సీ నివేదికను బయట పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా జగన్ సర్కార్ పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని, ఉద్యోగులకు మెరుగైన ఫిట్మెంట్తో పాటు ఇతర అలవెన్సులు అమలు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.