ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో చార్జీల పెంపు సరికాదు: Ramakrishna
ABN , First Publish Date - 2022-01-07T17:17:12+05:30 IST
సంక్రాంతి పండుగ వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనంగా చార్జీలు పెంచడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అన్నారు.
అమరావతి: సంక్రాంతి పండుగ వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనంగా చార్జీలు పెంచడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లు హైదరాబాద్ - విజయవాడకు రూ.3వేలు, హైదరాబాద్ - విశాఖకు రూ.5వేలు చార్జీలను వసూలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ ఆర్టీసీ సర్వీసుల్లో చార్జీలను పెంచలేదని తెలిపారు. తెలంగాణ తరహాలో ఏపీఎస్ఆర్టీసీలో కూడా సాధారణ చార్జీలు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల దోపిడీని నియంత్రించాలని రామకృష్ణ అన్నారు.