CPI Ramakrishna: అమరావతి నిర్మాణంపై బీజేపీ కపట నాటకాలు కట్టి పెట్టాలి
ABN , First Publish Date - 2022-07-30T17:20:19+05:30 IST
అమరావతి నిర్మాణంపై బీజేపీ కపట నాటకాలు ఇకనైనా కట్టిపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.
అమరావతి: అమరావతి నిర్మాణంపై బీజేపీ (BJP) కపట నాటకాలు ఇకనైనా కట్టిపెట్టాలని సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (Ramakrishna) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అసత్య ప్రచారాలతో బీజేపీ చేసే పాదయాత్రను మానుకోవాలన్నారు. ‘‘కేంద్రమంత్రి అమిత్ షా(Amith shah)తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఫోన్ చేయించండి. అమరావతి రాజధాని నిర్మాణం ఎందుకు జరగదో చూస్తాం’’ అంటూ రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు.