YCP ప్లీనరీలో కేవలం పొగడ్తలేనా?... Ramakrishna సూటి ప్రశ్న

ABN , First Publish Date - 2022-07-09T13:46:48+05:30 IST

వైసీపీ ప్లీనరీలో కేవలం పొగడ్తలేనా? లేక రాష్ట్ర అభివృద్ధిపై చర్చలేమన్నా ఉన్నాయా? అంటూ జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ సూటి ప్రశ్న వేశారు.

YCP ప్లీనరీలో కేవలం పొగడ్తలేనా?... Ramakrishna సూటి ప్రశ్న

అమరావతి: వైసీపీ ప్లీనరీ(YCP plenary)లో కేవలం పొగడ్తలేనా? లేక రాష్ట్ర అభివృద్ధిపై చర్చలేమన్నా ఉన్నాయా? అంటూ సీఎం జగన్‌(Jagan)కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ(Ramakrishna) సూటి ప్రశ్న వేశారు. వైఎస్ఆర్సీపీ ప్లీనరీ జరుపుకోవటం సంతోషమని... కాని రాష్ట్రంలో అభివృద్ధి అటకెక్కిందని విమర్శించారు. ఏపీ అప్పులు 8 లక్షల కోట్లకి చేరాయన్నారు. కేవలం లక్షా 60 వేల కోట్లు ప్రజా సంక్షేమానికి వెచ్చించామని జగన్మోహన్ రెడ్డి (Jagana mohan reddy) చెబుతున్నారని అన్నారు. మిగిలిన అప్పు 4 లక్షల కోట్లతో రాష్ట్రంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. 31 మంది వైసీపీ ఎంపీలున్నా కేంద్రం మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా(Special status) హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏపీ(AP)లో కొత్తగా ఒక్క పరిశ్రమనైనా రాబట్టారా? అంటూ నిలదీశారు. కేంద్రం చేసే ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయానికి మద్దతు ఇవ్వడం తప్ప, కేంద్రం నుంచి ఏపీకి ఏదైనా మేలు చేకూర్చగలిగారా? అని అడిగారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం ఏపీకి చేసిన ద్రోహాలపై ప్లీనరీలో చర్చించాలని రామకృష్ణ హితవుపలికారు. 

Updated Date - 2022-07-09T13:46:48+05:30 IST