భీమవరం సభలో మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలి: Ramakrishna

ABN , First Publish Date - 2022-07-04T14:44:26+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భీమవరానికి వస్తున్న సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పలు డిమాండ్లను ఆయన ముందు ఉంచారు.

భీమవరం సభలో మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలి: Ramakrishna

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) భీమవరానికి వస్తున్న సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ(Ramakrishna) పలు డిమాండ్లను ఆయన ముందు ఉంచారు. భీమవరం సభలో మోదీ ఏపీ (AP)కి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట హామీలను నెరవేర్చాలన్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి తగు నిధులు కేటాయించాలని అన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, కేంద్రీయ విద్యాసంస్థలకు తగు నిధులు మంజూరు చేయాలని తెలిపారు. అలాగే పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సత్వరమే నిధులు కేటాయించి, త్వరితగతిన పూర్తి చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-04T14:44:26+05:30 IST