ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలని నడ్డా కన్న కలలు కల్లలే: Ramakrishna

ABN , First Publish Date - 2022-06-09T13:33:57+05:30 IST

రూ.80 లక్షల కోట్ల అప్పులు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ తప్ప బీజేపీ దేశానికి ఏం మేలు చేసిందో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలని నడ్డా కన్న కలలు కల్లలే: Ramakrishna

అమరావతి: రూ.80 లక్షల కోట్ల అప్పులు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ తప్ప బీజేపీ(BJP) దేశానికి ఏం మేలు చేసిందో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా(JP Nadda) సమాధానం చెప్పాలని సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ(Ramakrishna) డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అప్పులు, అవినీతిమయం అయ్యిందని నడ్డా చాలా ఆలస్యంగా గుర్తించారన్నారు. అప్పుల కోసం అర్రులుచాచడంలో బీజేపీ, వైసీపీ దొందూ దొందే అని వ్యాఖ్యానించారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలని నడ్డా కన్న కలలు ఎన్నటికీ కల్లలే అని స్పష్టం చేశారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయింపు తదితర అంశాల్లో బీజేపీ తీరని ద్రోహం చేసిందన్నారు. ఏపీ ద్రోహి బీజేపీని ఏపీలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రామకృష్ణ పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-09T13:33:57+05:30 IST