పోలవరం ప్రాజెక్టుపై జగన్ ఇప్పటికైనా నోరు విప్పాలి: Ramakrishn

ABN , First Publish Date - 2022-06-04T13:52:40+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నోరు విప్పి, ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టుపై జగన్ ఇప్పటికైనా నోరు విప్పాలి: Ramakrishn

అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నోరు విప్పి, ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పోలవరం నిర్మాణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్, రాష్ట్ర మంత్రుల పరస్పర విరుద్ధ ప్రకటనలతో పోలవరం నిర్మాణం ప్రశ్నార్థకమైందన్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి ఏ ఏ అంశాలపై చర్చించారో ప్రజలకు వివరించాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస ప్యాకేజీ తదితరాలు సక్రమంగా అమలయ్యేందుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి చేయడంలేదో స్పష్టం చేయాలని రామక‌ృష్ణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-06-04T13:52:40+05:30 IST