గ్రూప్-1 అభ్యర్థుల ఎంపికలో అవకతవకలపై విచారణ జరపాలి: Ramakrishna

ABN , First Publish Date - 2022-05-31T13:59:20+05:30 IST

గ్రూప్-1 అభ్యర్థుల ఎంపికలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

గ్రూప్-1 అభ్యర్థుల ఎంపికలో అవకతవకలపై విచారణ జరపాలి: Ramakrishna

అమరావతి: గ్రూప్-1 అభ్యర్థుల ఎంపికలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy)కి ఆయన లేఖ రాశారు. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1లో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. గ్రూప్-1లో అవకతవకల వల్ల ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందన్నారు. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల పేపర్లను తిరిగి సమగ్ర మూల్యాంకనం జరిపి, అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 


Updated Date - 2022-05-31T13:59:20+05:30 IST