కేటీఆర్‌ వ్యాఖ్యలపై జగన్ స్పందించాలి: Ramakrishna

ABN , First Publish Date - 2022-04-30T13:18:10+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

కేటీఆర్‌ వ్యాఖ్యలపై జగన్ స్పందించాలి: Ramakrishna

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి పట్ల  తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోడ్లు గుంతలు పడి అధ్వానంగా ఉన్న పరిస్థితి వాస్తవమా కాదా? అని ప్రశ్నించారు. ‘‘ఏపీలో కరెంట్ చార్జీలు పెంచి, కరెంట్ కోతలు విధిస్తున్న సంగతి నిజమా కాదా?.. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాలను అటకెక్కించారా లేదా?... పారిశ్రామిక రంగంలో వీసమంతయినా అభివృద్ధి ఉందా?.. ప్రజలపై ఆస్తి, నీటి, చెత్త పన్నుల పెను భారాలు, ఆర్టీసీ బస్ చార్జీల భారాలు మోపారా లేదా? అంటూ రామకృష్ణ ప్రశ్నల వర్షం కురిపించారు. 

Updated Date - 2022-04-30T13:18:10+05:30 IST