జగన్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డ రామకృష్ణ

ABN , First Publish Date - 2022-05-05T13:42:00+05:30 IST

ఆర్టీసీని ప్రైవేటీకరించే దిశగా జగన్ సర్కార్ పావులు కదుపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శలు గుప్పించారు.

జగన్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డ రామకృష్ణ

అమరావతి: ఆర్టీసీని ప్రైవేటీకరించే దిశగా జగన్ సర్కార్ పావులు కదుపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల ఆస్తులు కలిగిన ఆర్టీసీకి సొంత బస్సులను ఎందుకు సమకూర్చుకోవడం లేదని ప్రశ్నించారు. యూనియన్ అగ్రిమెంట్ ప్రకారం 25 శాతం మాత్రమే అద్దె బస్సులు ఉండాల్సి ఉండగా, 35 శాతం అద్దె బస్సులకు ఎలా అనుమతించారని నిలదీశారు. రానున్న కాలంలో సొంత బస్సులు తగ్గిపోవటంతో పాటు ఆర్టీసీలో కొత్త ఉద్యోగాలు ఉండవన్నారు. ఇప్పటికే ఏపీలోని పోర్టులను ప్రైవేటు శక్తులకు కట్టబెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు దశలవారీగా ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ విషయంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పి, మడమ తిప్పారన్నారు. ఏపీఎస్ఆర్టీసీని నిర్వీర్యం చేసి రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రామకృష్ణ పేర్కొన్నారు.  

Read more