మార్చి 5న రాష్ట్ర బంద్కు సీపీఐ మద్దతు: రామకృష్ణ
ABN , First Publish Date - 2021-02-27T13:34:47+05:30 IST
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మార్చి 5న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక తలపెట్టిన రాష్ట్ర బంద్కు సీపీఐ మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడించారు.
అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మార్చి 5న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక తలపెట్టిన రాష్ట్ర బంద్కు సీపీఐ మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడించారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన తరుణమిది అని తెలిపారు. కేంద్రం మెడలు వంచేందుకు ఆంధ్రులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఏపీకి బీజేపీ చేస్తున్న ద్రోహాన్ని, కుట్రలను తిప్పికొట్టాలన్నారు. అన్ని రాజకీయ పక్షాలు, వర్తక, వాణిజ్య, ప్రజాసంఘాలు, అన్ని వర్గాల ప్రజలు మార్చి 5 బంద్ను జయప్రదం చేయవలసిందిగా రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.