సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2020-07-01T13:11:52+05:30 IST

సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

అమరావతి: రాష్ట్రంలో న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రామకృష్ణ లేఖ రాశారు. గత సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినప్పటికీ నిధుల విడుదల జరగలేదన్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా న్యాయవాదులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. యువ న్యాయవాదులకు ఆగిపోయిన నెలవారీ స్టైఫండ్ రూ.5 వేలు కూడా తక్షణం మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-01T13:11:52+05:30 IST