వివేకా హత్య కేసులో ఆధారాలిస్తే పారితోషకం ఇస్తామనడం సిగ్గుచేటు: Ramakrishna
ABN , First Publish Date - 2021-08-22T17:05:19+05:30 IST
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఆధారాలిస్తే పారితోషకం ఇస్తామనడం సిగ్గుచేటని సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు గుప్పించారు.
ప్రకాశం: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఆధారాలిస్తే పారితోషకం ఇస్తామనడం సిగ్గుచేటని సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ఎవరు హత్య చేశారో పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీలను అడిగితే చెబుతారన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ను కేంద్రం గెజిట్లో చేర్చాలని డిమాండ్ చేశారు. పనులు పూర్తయినా నీళ్ళు విడుదల చేయని ఏకైక ప్రాజెక్ట్ వెలిగొండ అని అన్నారు. టిడ్కో ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతోందని తెలిపారు. కృష్ణా రివర్ బోర్డు ఆఫీస్ను కర్నూలులో ఏర్పాటు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.