ఆ మరణాలపై సమగ్ర విచారణ చేపట్టాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-05-12T17:06:48+05:30 IST

రాష్ట్రంలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారందరికీ నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఆ మరణాలపై సమగ్ర విచారణ చేపట్టాలి: రామకృష్ణ

అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారందరికీ నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ లోపంతో 31 మంది వరకు చనిపోగా 11 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం చెబుతోందని మండిపడ్డారు. అనంతపురం, విజయనగరం, కదిరి, కర్నూలు, హిందూపురం, అమలాపురంలో ఆక్సిజన్ కొరత కారణంగా మృతి చెందిన కరోనా రోగుల కుటుంబాలకు కూడా రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషీయా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఆక్సిజన్ సరఫరా లోపంతో జరిగిన మరణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని రామకృష్ణ అన్నారు.

Updated Date - 2021-05-12T17:06:48+05:30 IST