రైతులను, ప్రజలను ఆదుకోండి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-09-29T14:57:41+05:30 IST

రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల వల్ల కలిగిన నష్టంపై సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు.

రైతులను, ప్రజలను ఆదుకోండి: రామకృష్ణ

అమరావతి: రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల వల్ల కలిగిన నష్టంపై సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. వరదల కారణంగా గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. కరోనాకు తోడు వరదలు ప్రజల జీవనోపాధికి పెను ప్రమాదంగా మారాయన్నారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని తక్షణమే అంచనా వేయించాలని... రైతులను, ప్రజలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-29T14:57:41+05:30 IST