స్టీల్ ప్లాంట్పై జీవీఎల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా: సీపీఐ నేత
ABN , First Publish Date - 2021-09-15T19:28:09+05:30 IST
బీజేపీ ఎంపీ జీవిఎల్ స్టీల్ ప్లాంట్పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని సీపీఎం నేత నర్సింగ్ రావు అన్నారు.
విశాఖపట్నం: బీజేపీ ఎంపీ జీవిఎల్ స్టీల్ ప్లాంట్పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని సీపీఎం నేత నర్సింగ్ రావు అన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రభుత్వం రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. రైల్వే జోన్ ప్రయత్నం జరుగుతుందని జీవీఎల్ చెబుతున్నారని... జోన్ ప్రసక్తే లేదని రైల్వే మంత్రి చెబుతున్నారని అన్నారు. జీవీఎల్ చెబుతోంది అబద్ధమని తెలిపారు. స్టీల్ ప్లాంట్ వాల్యూషన్ వేసే స్థితి లేదని ప్రైవేట్పరం చేయడం వారి తరం కాదని స్పష్టంచేశారు. భయపడే ఎవరు బిడ్డింగ్కి రావడం లేదని అన్నారు. ఏపీ ప్రజలు అందరు స్టీల్ ప్లాంట్పై వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా తమ నిర్ణయం మార్చుకోవానలి లేని పక్షంలో ఏపీలో బీజేపీ అడ్రెస్ ఉండదని నర్సింగ్ రావు హెచ్చరించారు.