తెలంగాణ గవర్నర్ లక్ష్మణరేఖను దాటుతున్నారు: Narayana

ABN , First Publish Date - 2022-06-09T16:28:10+05:30 IST

గవర్నర్‌ తమిళిసై వ్యవహారశైలిపై సీపీఐ నారాయణ పలు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ గవర్నర్ లక్ష్మణరేఖను దాటుతున్నారు: Narayana

హైదరాబాద్: గవర్నర్‌ తమిళిసై(Tamilisai) వ్యవహారశైలిపై సీపీఐ నారాయణ(Narayana) పలు వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన... తెలంగాణ గవర్నర్ లక్ష్మణరేఖను దాటుతున్నారని తెలిపారు. ఈరోజు మహిళల దర్బార్ దేనికి పెడుతున్నారని ప్రశ్నించారు. రాజకీయ కార్యకలాపాలకు రాజ్ భవన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఒకవైపు బీజేపీ రాజకీయ దాడి పెంచిందని, మరోవైపు గవర్నర్ పాత్ర అగ్నికి అజ్యం పోస్తున్నారని అన్నారు. మైనర్లను పబ్‌లోకి అనుమతించడం చట్టరీత్యా నేరమన్నారు. పబ్‌ను సీజ్‌ చేసి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-06-09T16:28:10+05:30 IST