జగన్, చిరంజీవి మధ్య ఏం జరిగిందో తెలియాల్సిందే: Narayana

ABN , First Publish Date - 2022-01-16T18:07:14+05:30 IST

సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

జగన్, చిరంజీవి మధ్య ఏం జరిగిందో తెలియాల్సిందే: Narayana

అమరావతి: సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. చిరుకు రాజ్యసభ సీటు కాయమంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే రాజకీయాల్లో వచ్చేది లేదని చిరంజీవి స్పష్టం చేయడంతో ఆ గొడవ కాస్త సద్దుమణిగింది. తాజాగా జగన్, చిరంజీవి భేటీపై సీపీఐ నేత నారాయణ పలు వ్యాఖ్యలు చేశారు. జగన్..‌ చిరంజీవి మధ్య ఏమి జరిగిందో తేలాల్సిందేనని అన్నారు. ‘‘చిరంజీవిని తాము పిలవలేదని.. ఆయనే వచ్చారని ప్రభుత్వం చెప్తోంది... సీఎం పిలిస్తేనే వెళ్ళానని చిరంజీవి అంటున్నారు. ఏది నిజమో ప్రజలకు తెలియాలి’’ అని డిమాండ్ చేశారు. పబ్లిక్ ఇష్యూని వ్యక్తిగతంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. కనుమ రోజు కఠోర వాస్తవాలు మాట్లాల్సి వస్తోందని నారాయణ అన్నారు.

Updated Date - 2022-01-16T18:07:14+05:30 IST