పేదలను జగన్ ప్రభుత్వం దగా చేసింది: CH baburao
ABN , First Publish Date - 2022-06-13T17:25:22+05:30 IST
పేదలను జగన్ ప్రభుత్వం దగా చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సీహెచ్ బాబూరావు విమర్శించారు.
అమరావతి: పేదలను జగన్ ప్రభుత్వం దగా చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సీహెచ్ బాబూరావు విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో సర్కార్ విఫలమైందని వ్యాఖ్యానించారు. జగనన్న కాలనీలు, నవరత్నాల పేరుతో మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. సెంటు స్థలం అంటూ ముంపు ప్రాంతాల్లో స్థలాలు కేటాయించారన్నారు. స్థలం కొనుగోలులో రూ.వందల కోట్లు స్కామ్ జరిగిందని బాబూరావు ఆరోపించారు.