దివీస్ పై సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి

ABN , First Publish Date - 2020-12-06T05:36:09+05:30 IST

తుని, డిసెంబరు 5: తొండంగి మండలంలో దివీస్‌ పరిశ్రమపై సీఎం జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సీపీఐ (ఎంఎల్‌) నాయకులు డిమాండ్‌ చేశారు. దివీస్‌ వ్యతిరేక పోరాట ఉద్యమకారులకు మద్దతుగా తుని పట్టణంలో శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు

దివీస్ పై సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి
తునిలో నిరసన తెలియజేస్తున్న సీపీఐ నేతలు

సీపీఐ నాయకుల డిమాండ్‌

తుని, డిసెంబరు 5: తొండంగి మండలంలో దివీస్‌ పరిశ్రమపై సీఎం జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సీపీఐ (ఎంఎల్‌) నాయకులు డిమాండ్‌ చేశారు. దివీస్‌ వ్యతిరేక పోరాట ఉద్యమకారులకు మద్దతుగా తుని పట్టణంలో శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు కె.జనార్థన్‌, మానుకొండ లచ్చబాబు మాట్లాడుతూ ప్రజల్లో నాడు మాట తప్పను- మడమ తిప్పనన్న జగన్‌ అధికారంలోకి వస్తే దివీస్‌ ఫ్యాక్టరీని బంగాళాఖాతంలో పాతేస్తానని ప్రజలను నమ్మించి, అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్యాక్టరీ నెలకొల్పడం దారుణమని పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల కోన తీరప్రాంతంలో ప్రజల జీవనానికి, మత్స్య సంపదలకు, హేచరీలకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. దీన్ని వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జక్కంపూడి రాజు, అప్పారావు, పాదాలు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:36:09+05:30 IST