టీఆర్‌ఎస్‌లో చేరిన సీపీఐ కౌన్సిలర్‌

ABN , First Publish Date - 2021-04-13T05:48:29+05:30 IST

టీఆర్‌ఎస్‌లో చేరిన సీపీఐ కౌన్సిలర్‌

టీఆర్‌ఎస్‌లో చేరిన సీపీఐ కౌన్సిలర్‌
కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే

కృష్ణకాలనీ, ఏప్రిల్‌ 12 : భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలోని 25వ వార్డు సీపీఐ కౌన్సిలర్‌ సజ్జనపు స్వామి సహా సుమారు 60 మంది సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకు న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగస్వాము లు కావాలని కోరారు. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను చూసి టీఆర్‌ఎస్‌లో చేరడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకటరాణి, కౌన్సిలర్లు శిరుప అనిల్‌, ముంజాలరవీందర్‌, రేణుక, నాయకుడు బి.రమేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-13T05:48:29+05:30 IST