సైబరాబాద్ కమిషనరేట్లో నిరుపయోగ వస్తువుల వేలం 11న
ABN , First Publish Date - 2020-07-08T09:23:02+05:30 IST
సైబరాబాద్ కమిషనరేట్లో స్టోర్ విభాగంలో నిరుపయోగంగా ఉన్న వస్తువులను వేలం వేయనున్నట్లు ..
హైదరాబాద్ సిటీ, జూలై 7(ఆంధ్రజ్యోతి): సైబరాబాద్ కమిషనరేట్లో స్టోర్ విభాగంలో నిరుపయోగంగా ఉన్న వస్తువులను వేలం వేయనున్నట్లు సీపీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏసీ, కంప్యూటర్ చైర్స్, టేబుల్, డెస్క్టాప్ సెట్, బ్లూటూత్ ప్రింటర్స్, ఎక్సటర్నల్ హార్డ్ డిస్క్స్, ల్యాండ్ ఫోన్లు, పవర్ బ్యాంక్స్, పవర్ బ్యాటరీస్, యూపీఎస్ తదితర వస్తువులను వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. వేలంలో పాల్గొనదలచిన వారు ఈనెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు 9490617324 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.