మనందరి మంచి కోసమే చెబుతున్నా..: సజ్జనార్‌

ABN , First Publish Date - 2021-05-17T17:43:24+05:30 IST

మనందరి మంచికోసమేనని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు.

మనందరి మంచి కోసమే చెబుతున్నా..: సజ్జనార్‌

హైదరాబాద్‌ సిటీ : అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, లాక్‌డౌన్‌ మనందరి మంచికోసమేనని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. సుచిత్ర, అల్వాల్‌, గోల్నాక క్రాస్‌రోడ్స్‌, ఆల్విన్‌ కాలనీ, దూలపల్లి క్రాస్‌రోడ్స్‌ ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కమిషనరేట్‌ పరిధిలో దాదాపు 5వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఎస్సీఎస్సీతో కలిసి త్వరలో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్‌, హెడ్‌ క్వార్టర్స్‌ ఏడీసీపీ మానిక్‌రాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-17T17:43:24+05:30 IST