సీపీ మహేశ్ భగవత్ సీరియస్ వార్నింగ్
ABN , First Publish Date - 2021-05-14T19:32:44+05:30 IST
కీసర నాగారం నుంచి హయత్నగర్ వరకు
- ‘అంబులెన్స్’కు సీపీ వార్నింగ్
- డబ్బులు వాపస్ ఇప్పించిన మహేశ్ భగవత్
- నాగారం నుంచి హయత్నగర్కు..
- రూ. 1.60 లక్షలు వసూలు చేసిన అంబులెన్స్ యజమాని
హైదరాబాద్/మన్సూరాబాద్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో 46 చెక్పోస్టులు ఏర్పాటు చేశామని రాచకొండ కమిషనర్ మహేశ్భగవత్ తెలిపారు. గురువారం ఆయన ఎల్బీనగర్ జంక్షన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబులెన్స్ యజమానులు అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కీసర నాగారం నుంచి హయత్నగర్ వరకు ఓ అంబులెన్స్ డ్రైవర్ రూ.1.60 లక్షల వసూలు చేశాడని, అతడిని పిలిచి వార్నింగ్ ఇచ్చి డబ్బులు రిటర్న్ ఇప్పించామని వివరించారు. రెమ్డెసివిర్ అధిక ధరలకు బ్లాక్లో అమ్ముతున్న 30 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. దరఖాస్తు చేసుకున్న రోజునే పాసులు ఇస్తున్నామని, మూడు రోజులు మాత్రమే అవి చెల్లుబాటు అవుతాయని, తర్వాత రెన్యూవల్ చేసుకోవాలన్నారు. కాగా, లాక్డౌన్తో ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోలు ప్రాంతాల్లోని రోడ్లన్నీ ఖాళీగా కన్పించాయి.