రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో..

ABN , First Publish Date - 2020-03-29T10:37:53+05:30 IST

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 1989 మంది కరోనా అనుమానితులు ఉన్నట్టు గుర్తించామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పేర్కొన్నారు.

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో..

1989 మంది కరోనా అనుమానితులు

1740 మందికి పరీక్షలు, ముగ్గురికి పాజిటివ్‌

1664 మంది హోం క్వారంటైన్‌: సీపీ మహేష్‌ భగవత్‌


హైదరాబాద్‌ సిటీ, మార్చి 28(ఆంధ్రజ్యోతి): రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 1989 మంది కరోనా అనుమానితులు ఉన్నట్టు గుర్తించామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పేర్కొన్నారు. వారిలో ఇప్పటి వరకు 1740 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు. మరో 1664 మంది హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారని సీపీ వెల్లడించారు. నెగిటివ్‌ వచ్చిన వారిని వదిలేశార ని తెలిపారు.


కొవిడ్‌-19 నేపథ్యంలో అమల్లో ఉన్న లాక్‌ డౌన్‌ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినా, హోం క్వారంటైన్‌ వదిలి బయటకు వచ్చినా రాచకొండ కొవిడ్‌ కంట్రోల్‌ రూ మ్‌కు 9490617234 సమాచారం ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా డయల్‌-100కు ఫోన్‌ చేయాలని పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-29T10:37:53+05:30 IST