డ్రోన్తో నిరంతర పర్యవేక్షణ.. రోడ్లపైకి రావొద్దు: సీపీ
ABN , First Publish Date - 2020-04-09T15:09:30+05:30 IST
కరీంనగర్: కరీంనగర్లో యువత లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తోంది.
కరీంనగర్: కరీంనగర్లో యువత లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇప్పటి వరకూ ఐదు వేలకు పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాల సీజ్తో పాటు భారీగా ఫైన్లు విధిస్తున్నారు. ఇకపై నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తామని సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. డ్రోన్తో నిరంతరం పర్యవేక్షిస్తామని వెల్లడించారు. కారణం లేకుండా ఎవరూ రోడ్ల పైకి రావొద్దని సీపీ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు.