పబ్బుల యాజమాన్యాలకు అంజనీ కుమార్ సీరియస్ వార్నింగ్

ABN , First Publish Date - 2021-12-24T21:31:05+05:30 IST

పబ్బుల యాజమాన్యాలకు నగర సీపీ అంజనీ కుమార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

పబ్బుల యాజమాన్యాలకు అంజనీ కుమార్ సీరియస్ వార్నింగ్

హైదరాబాద్: పబ్బుల యాజమాన్యాలకు నగర సీపీ అంజనీ కుమార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. మైనర్లకు లిక్కర్ అమ్మితే బార్లు, పబ్‌లకు చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలపై ఆరోగ్యశాఖ ఇచ్చే సూచనల మేరకు ముందుకు వెళతామన్నారు. కొన్ని ఆంక్షలతో వేడుకలు చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 31 రాత్రి అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పిల్లలు విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలన్నారు. వేడుకల్లో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అంజనీ కుమార్ సూచించారు.


Updated Date - 2021-12-24T21:31:05+05:30 IST