AP News: పశువుల వ్యాన్ బోల్తా.. 26 ఆవులు మృతి
ABN , First Publish Date - 2022-10-03T02:14:33+05:30 IST
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొర్లె సీతారామపురం గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున పశువుల
బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొర్లె సీతారామపురం గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున పశువుల వ్యాన్ బోల్తా పడి 26 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. పార్వతీపురం మన్యం జిల్లా గుమడ నుంచి తెలంగాణలోని హైదరాబాద్కు పశువులను తరలిస్తున్న లారీ బొబ్బిలి మండలం గొర్లెసీతారామపురం వేంకటేశ్వర స్వామి ఆలయం సమీపానికి వచ్చేసరికి వ్యాన్ అదుపు తప్పింది. రోడ్డు పక్కకు బోల్తా కొట్టింది. శనివారం అర్ధరాత్రి ఒంటిగంటన్నర దాటిన తరువాత ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో 26 ఆవులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 21 పశువులకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొన్ని ఆవులు చెట్టుకొకటి, పుట్టకొకటిగా పొలాల వెంబడి వెళ్లిపోయాయి. మృతి చెందిన ఆవుల వివరాలను నమోదు చేసి వాటిని ఊరికి దూరంగా అధికారులు ఖననం చేయించారు.