యూపీలో పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-22T02:36:20+05:30 IST

యూపీలో పెరిగిన కరోనా కేసులు

యూపీలో పెరిగిన కరోనా కేసులు

లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు యూపీలో కొత్తగా మరో 181 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. యూపీ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,356 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా వల్ల 127 మంది చనిపోయారని, ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలు తిరిగి రాష్ట్రానికి రావడంతో కొత్తగా కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్య అధికారులు తెలిపారు.

Updated Date - 2020-05-22T02:36:20+05:30 IST