ఢిల్లీలో పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-23T21:50:38+05:30 IST

ఢిల్లీలో పెరిగిన కరోనా కేసులు

ఢిల్లీలో పెరిగిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఢిల్లీ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం మధ్యాహ్నానికి ఢిల్లీలో కొత్తగా మరో 591 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం 12,910 కరోనా కేసులు నమోదైనట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. 


Updated Date - 2020-05-23T21:50:38+05:30 IST