నేపాల్ లో పెరిగిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-07-13T00:17:24+05:30 IST
నేపాల్ లో పెరిగిన కరోనా కేసులు
ఖాట్మండ్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నేపాల్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ దేశంలో రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆదివారం నాటికి కొత్తగా నేపాల్ దేశంలో 82 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 16,801 కరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వల్ల 38 మంది మృతి చెందారు. కరోనా నుంచి 8,589 మంది కోలుకున్నారని ప్రభుత్వం తెలిపింది.