హిమాచల్ ప్రదేశ్ లో పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-07T01:09:58+05:30 IST

హిమాచల్ ప్రదేశ్ లో పెరిగిన కరోనా కేసులు

హిమాచల్ ప్రదేశ్ లో పెరిగిన కరోనా కేసులు

సిమ్లా: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రోజు కొత్తగా రాష్ట్రంలో 20 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 2,937 కరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్ వల్ల 15 మంది చనిపోయినట్లు ఉన్నతాధికారులు చెప్పారు.


Updated Date - 2020-08-07T01:09:58+05:30 IST