ఢిల్లీలో కొత్తగా 1,299 కరోనా కేసులు నమోదు, 15 మంది మృతి

ABN , First Publish Date - 2020-08-07T00:58:19+05:30 IST

ఢిల్లీలో కొత్తగా 1,299 కరోనా కేసులు నమోదు, 15 మంది మృతి

ఢిల్లీలో కొత్తగా 1,299 కరోనా కేసులు నమోదు, 15 మంది మృతి

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు ఢిల్లీలో కొత్తగా 1,299 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,41,531 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వల్ల గురువారం రోజు 15 మంది మృతి చెందగా, మొత్తం 4,059 మంది కోవిడ్ -19తో చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి 1,27,124 మంది కోలుకున్నారని, ప్రస్తుతం 10,348 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.


Updated Date - 2020-08-07T00:58:19+05:30 IST