కరోనా.. 101

ABN , First Publish Date - 2020-11-30T05:23:51+05:30 IST

జిల్లాలో కొత్తగా ఆదివారం 101 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కరోనా.. 101

గుంటూరు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా ఆదివారం 101 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం వరకు అందిన 4,042 శాంపిల్స్‌ ఫలితాల్లో పాజిటివ్‌ శాతం 2.50గా నమోదైంది. మిగిలిన 3,941(97.50శాతం) మందికి నెగెటివ్‌ వచ్చింది. జిల్లాలో ఇప్పటివరకు 74,466 కేసులు నమోదు కాగా వారిలో 73,046 మంది కోలుకొన్నారు. 712 మంది చనిపోయారు. కోలుకొన్న వారి శాతం 98.09గా కొనసాగుతోంది. ఆదివారం మరో 3,715 శాంపిల్స్‌ని సేకరించారు. కొత్తగా గుంటూరు నగరంలో 34, సత్తెనపల్లిలో 6, తాడేపల్లిలో 5, నాదెండ్లలో 5, నరసరావుపేటలో 9, బాపట్లలో 4, నిజాంపట్నంలో 4, తెనాలిలో 4 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మిగిలిన మండలాల్లో మరో 30 మందికి వైరస్‌ సోకింది. 

Updated Date - 2020-11-30T05:23:51+05:30 IST