జర్నలిస్ట్‌లకు కోవిడ్‌ వాక్సిన్‌

ABN , First Publish Date - 2021-03-08T22:43:34+05:30 IST

ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కోవిడ్‌ టీకా వేసే కార్యక్రమం సోమవారం సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో ప్రారంభమైంది.

జర్నలిస్ట్‌లకు కోవిడ్‌ వాక్సిన్‌

హైదరాబాద్: ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కోవిడ్‌ టీకా వేసే కార్యక్రమం సోమవారం సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో ప్రారంభమైంది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచనల మేరకు యశోద ఆస్పత్రి వైద్యులు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రోటోకాల్‌ పరిధిలోకి వచ్చే సీనియర్‌ జర్నలిస్టులు – వారి కుటుంబ సభ్యులకు తొలి డోస్‌ టీకా వేశారు. తొలి రోజు డెబ్బై మంది జర్నలిస్టుల కుటుంబాలకు డాక్టర్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో టీకా వేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు ఎస్‌.విజయ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ జర్నలిస్టులు డాక్టర్‌ కె.రామచంద్రమూర్తి, దుర్గాకుమార్, రాధా శివమోహన్, వీరేంద్ర కపర్తి, రాంలాల్, ప్రసాద్‌ బోసేకర్, సన్యాసిరావు, ఎన్‌.భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ క్యాంపు మరో మూడు రోజుల పాటు కొనసాగనుంది.

Updated Date - 2021-03-08T22:43:34+05:30 IST