ఆస్పత్రులకు చేరిన కొవిడ్ వ్యాక్సిన్
ABN , First Publish Date - 2021-01-16T05:04:32+05:30 IST
పారిశ్రామిక ప్రాంతానికి కొవిడ్ వ్యాక్సిన్లు శుక్రవారం చేరుకున్నాయి.
మల్కాపురం. జనవరి 15 : పారిశ్రామిక ప్రాంతానికి కొవిడ్ వ్యాక్సిన్లు శుక్రవారం చేరుకున్నాయి. శ్రీహరిపురంలోని జీవీఎంసీ ఆస్పత్రి, మల్కాపురంలోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రానికి డిస్ట్రిక్ ఇమ్యునైజేషన్ ఆఫీస్ (డీఐఓ) నుంచి కోల్డ్స్టోరేజ్ వాహనంలో ఉదయం ఎనిమిది గంటలకు తీసుకొచ్చారు. వాటిని ఆస్పత్రుల్లోని రిఫ్రిజిరేటర్లలో భద్రపరిచారు. ఈ వ్యాక్సిన్ను తొలి విడత ఆరు రోజుల పాటు వైద్య సిబ్బందికి ఇస్తారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.