దేశంలో 165.04 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-29T19:59:56+05:30 IST

దేశంలో కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలుతీసుకుంటోంది.

దేశంలో 165.04 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలుతీసుకుంటోంది. అందులో భాగంగానేప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది. ఈ మేరకు ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 165.04 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గడిచిన 24 గంటల్లోనే 56 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 93.89 శాతంగా కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,35,532 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్్య 20,04,333 ఉండగా వీక్లీ పాజిటివిటీ రేట్ 16.89 శాతంగా వుంది. 

Updated Date - 2022-01-29T19:59:56+05:30 IST