దేశంలో 155.39 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ
ABN , First Publish Date - 2022-01-14T20:54:01+05:30 IST
దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది.
హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటి వరకూ దేశంలో 155.39 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 73 లక్షల వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేట్ 95.20 గా వుందని అధికారులులిపారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,753 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 12,72,073 కాగా గడిచిన 24 గంటల్లో ఒమైక్రాన్ కేసుల సంఖ్య 4.83 శాతం పెరిగినట్టు అధికారులు తెలిపారు. వీక్లీ పాజిటివిటీ రేట్ 11.83 శాతంగా అధికారులు పేర్కొన్నారు.