దేశంలో 147.72 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-05T22:30:22+05:30 IST

దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టింది.

దేశంలో 147.72 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే ఇప్పటి వరకూ 147.72 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 96 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.01 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,097 కేసులు నమోదైనట్టు తెలిపింది. వీక్ దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,14,004 కాగా వీక్లీ పాజిటివి రేట్ 2.60 శాతంగా వుందని అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-05T22:30:22+05:30 IST