దేశంలో ముమ్మరంగా కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-03T20:40:12+05:30 IST

దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

దేశంలో ముమ్మరంగా కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 145.68 రోట్ల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 23 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,45,582 కాగా, రికవరీ రేట్ 98.20శాతంగా నమోదైంది. కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 33,750 నమోదయ్యాయి. వీక్లీ పాజిటివ్ రేట్1.68 శాతంగా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-03T20:40:12+05:30 IST