దేశంలో 145.16 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-01T21:37:16+05:30 IST

దేశంలో కోవిడ్ నివారణకు ప్రభుత్వం వ్యాక్సిన్ డోసుల పంపిణీ ప్రక్రియ ముమ్మరం చేసింది.

దేశంలో 145.16 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ నివారణకు ప్రభుత్వం వ్యాక్సిన్ డోసుల పంపిణీ ప్రక్రియ ముమ్మరం చేసింది. ఈ మేరకు ఇప్పటి వరకూ 145.16 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 58లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులనుపంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.32 శాతం కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,775 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,04,781 కాగా వీక్లీ పాజిటివ్ రేట్ 1.10శాతంగా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-01T21:37:16+05:30 IST